తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను నియోజకవర్గ ప్రజలు సొంతబిడ్డలా ఆదరిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా వీర తిలకం దిద్ది పోరుదారిలో గెలిచి నిలువాలని ఆశీర్వదిస్తున్నారు.
కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఆయనతో గ్రామస్తులూ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు.
గౌడన్నలు, యాదవులు, దళితులు, ఇతరకులాల ప్రజలు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దారిపొడవునా గెల్లుకు నీరాజనాలు పడుతున్నారు.
సల్లంగ బతుకు బిడ్డా, అందర్నీ ఆదుకో కొడుకా అంటూ వృద్ధులు ఆశీర్వచనాలు ఇస్తున్నారు. జై తెలంగాణ, జై టీఆర్ఎస్ నినాదాలతో ఉప్పల్ గ్రామం హోరెత్తిపోతోంది.