పెద్దపల్లి కమాన్, అక్టోబర్ 12: హై కోర్టు లాయర్ దంపతులు గట్టు వామన్రావు-పీవీ నాగమణి హత్య కేసులో నిందితులు ఏ-1 కుంట శ్రీనివాస్, ఏ-2 సీమంతుల చిరంజీవికి పెద్దపల్లి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
గురువారం కోర్టులో నిందితుల తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. వాదనలు విన్న ప్రాసిక్యూషన్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి-మంథని రహదారిలోని కల్వచర్ల సమీపంలో కారులో ప్రయాణిస్తున్న గట్టు వామన్రావు, పీవీ నాగమణి హత్యకు గురైన విషయం తెలిసిందే.