Gatani Raju | బన్సీలాల్పేట్, అక్టోబర్ 31: ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందుతుడు గటాని రాజు సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పోలీసు బందోబస్తు నడుమ, ఆర్ఐసీయూ వార్డులోని వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని, ఎలాంటి ప్రాణాపాయం లేదని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు తెలిపారు.
అతడికి ఎక్స్రే, ఈసీజీ ఇతర పరీక్షలు చేశామని, ముక్కు ఎముకలో కొంత ఫ్రాక్చర్ ఉన్నట్టు గుర్తించామని, ఇందుకు ఆర్థోపెడిక్ వైద్యులు చికిత్స అందిస్తున్నారని వివరించారు. రెండు రోజుల్లో సాధారణ పరిస్థితికి రాగానే డిశ్చార్జి చేస్తామని చెప్పారు.