హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. చేవెళ్ల వద్ద 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఏడుగురిని అరెస్టు చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.10లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా లారీ, కారు, బంగారం, వెండి, నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, మరో ముగ్గురు నిందితులు పరారయ్యారని శంషాబాద్ డీసీపీ వెల్లడించారు. ఏడాదిలో ఇప్పటి వరకు రూ.5కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నట్లు డీసీపీ వివరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.