కరీంనగర్ ముకరంపుర, మే 15: రాష్ట్రంలో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. రైతుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు మకలు పండిస్తే కేవలం 25 క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెప్పడంతో ఒకో రైతు ఎకరానికి రూ.25 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ వ్యవసాయ మారెట్ యార్డ్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మకల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. తక్షణమే రైతుల నుంచి మకలు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, పండిన పంటను పూర్తిగా కొనుగోలు చేశామని గుర్తుచేశారు.