కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 8 : ‘అదిచేస్తాం.. ఇది చేస్తాం అని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండేండ్లలో కరీంనగరంలో పైసా పని చేయలేదు. అలాంటి పార్టీలకు ఓటు వేయొద్దు. ఓటేసి మరోసారి మోసపోవద్దు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రజలకు సూచించారు.
ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూ.1,650 కోట్లతో కరీంనగర్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినట్టు గుర్తుచేశారు.