ఖైరతాబాద్, ఏప్రిల్ 28: ముదిరాజ్లను బీసీ-ఏ జాబితాలో కలుపుతామని ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నదని గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడప శ్రీహరి విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన మాట్లాడారు.
ఈ నెల 14న నారాయణపేటలో జరిగిన ఎన్నికల సభలో బీసీ-డీలో ఉన్న ముదిరాజ్లను బీసీ-ఏ జాబితాలో కలుపుతామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న అంశంపై ఇలాంటి హామీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యోచనను విరమించుకోవాలని కోరారు.