హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో గణేశుని శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా ముగిశాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తొమ్మిరోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరిగాయని చెప్పారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
భక్తులకు సౌకర్యాలు కల్పించిన జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, ఆర్ అండ్ బీ, జలమండలి, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, ఆర్టీసీ అధికారులు, సిబ్బందిని అభినందించిండంతోపాటు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా చేసిన ప్రభుత్వానికి, అధికారులకు సహకరించిన ప్రజలు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.