హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రగతిభవన్లో ఐదురోజులపాటు పూజలందుకొన్న గణనాధుడికి ఆదివారం ఘనంగా నిమజ్జనం నిర్వహించారు. అంత కు ముందు.. రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలని, తెలంగాణ సమస్త ప్రజానీకం సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, శోభ దంపతులు గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మనుమడు హిమా న్షు, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, ఎంపీ దీవకొండ దామోదర్రావు, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.