Gandhi Bhavan | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): గాంధీభవన్ కేంద్రంగా కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం దుష్ప్రచారం చేస్తున్నది. దీని ఫలితంగానే ఢిల్లీ పోలీసుల నుంచి సోమవారం తాఖీదులు అందుకోక తప్పలేదు. రాజకీయ ప్రత్యర్థులను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక, తప్పుడు ప్రచారం, బురద జల్లడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకొన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇలాగే బదనాం చేసిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలు, ప్రత్యర్థుల వ్యాఖ్యలను మార్ఫింగ్ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నది. కర్ణాటకలో కాంగ్రెస్కు అధికారం సోషల్ మీడియా వల్లే సాధ్యపడిందన్న విమర్శలు ఉన్నాయి.
సొంత పార్టీలో, అధిష్ఠానంలో తనను రాజకీయంగా దెబ్బతీయడానికి పార్టీ సోషల్ మీడియానే పథకం ప్రకారం కుట్ర చేస్తున్నట్టు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్ వార్రూమ్పై అప్పట్లో పోలీసులు దాడిచేసి కంప్యూటర్ల హార్డ్డిస్క్లను స్వాధీనం చేసుకొన్నారు. తర్వాత కాంగ్రెస్ సోషల్ మీడియా కొంతకాలం పాటు కర్ణాటక కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహించింది. తమ రాజకీ య ప్రత్యర్థులు, నాయకులపై బుర ద జల్లడం, వారి వ్యాఖ్యలు, మాటలను ఎడిటింగ్, మార్ఫింగ్ చేయటం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతా లు, సమాచారాన్ని విస్తృతంగా ప్ర చారం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రులపై, ఆరు గ్యారెంటీలు అమలు కావటం లేదని సోషల్మీడియాలో పోస్టుచేసిన వారిపై మాత్రం కేసులు పెట్టి జైలుకు పంపారు. తనపై, పార్టీపై, కేసీఆర్పై కొన్ని యూట్యూబ్ చానల్స్ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఆ కథనాలు కాంగ్రెస్ సోషల్ మీడియా వండి వార్చినవేనని బయటపడింది.