హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఎంపీ టికెట్ ఆశావహులతో గాంధీభవన్లో రెండు రోజులుగా సందడి నెలకొన్నది. దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించడంతో ఆశావహులు తమ అనుయాయులతో తరలివస్తున్నారు. గురువారం సాయంత్రానికి 41 అప్లికేషన్లు అందాయి.
వీటిలో మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానానికి అత్యధికంగా 9 దరఖాస్తులు రాగా, నాగర్కర్నూల్ నుంచి 8, వరంగల్ నుంచి 6, భువనగిరి నుంచి 6, నిజామాబాద్ నుంచి 3, ఖమ్మం నుంచి 2 దరఖాస్తులు అందినట్టు గాంధీభవన్వర్గాలు తెలిపాయి. ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ దరఖాస్తు చేసుకొన్నారు. నాగర్కర్నూల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానానికి మల్లు రవి ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, మరో మాజీ ఎంపీ మందా జగన్నాధం గురువారం దరఖాస్తు చేసుకున్నారు. భువనగరి టికెట్కు చామల కిరణ్, నిజామాబాద్ టికెట్కు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అప్లికేషన్ పెట్టుకున్నారు.