హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జీ కిరణ్కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 138 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్కు ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు.
జాయింట్ సెక్రటరీగా బైరెడ్డి
తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా బైరెడ్డి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఆయన 171 ఓట్ల మెజార్టీ సాధించారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖకు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా
చేస్తున్నారు.