హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఫ్యూచర్సిటీ పేరిట కాంగ్రెస్ సర్కార్ రియల్ఎస్టేట్ దందాకు తెరలేపిందని హరీశ్రావు మాట్లాడింది ముమ్మాటికీ నిజమని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ తలపెట్టిన ఫార్మాసిటీని రద్దుచేస్తామని, ఇందుకోసం సేకరించిన 13,500 ఎకరాలను రైతులకు వాపస్ ఇస్తామని ఓట్ల కోసం ప్రగల్భాలు పలికిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు భూ దందా కోసం ఫ్యూచర్సిటీని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఉన్నది ఉన్నట్టు మా ట్లాడిన హరీశ్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అవాకులు చెవాకులు పేలడం శోచనీయమని అ న్నారు. వాస్తవాలు మాట్లాడిన వారి పై ఎదురుదాడి చేయడం కాంగ్రెస్ నేతలకు రివాజుగా మారిందని ఆగ్ర హం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీకి, వారు తెచ్చే ఫ్యూచర్సిటీకి ఫ్యూచర్ లేదని ఎద్దేవాచేశారు.