మిర్యాలగూడ, ఫిబ్రవరి 10: ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పందిళ్లపల్లి చెరువు వద్ద టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం ప్రధాని మోదీ చిత్రపటానికి పిండ ప్రదానం చేశారు. అనంతరం పిండాలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ షోయబ్ మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలన చేస్తున్న మోదీకి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు జిల్లా శ్రీనాథ్, మహేశ్నాయుడు, లోకేశ్, కిరణ్, శ్రీకాంత్, రామకృష్ణ, అఖిల్, వీరానాయక్, సాయి పాల్గొన్నారు.