సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మే 25: ప్రాథమిక హక్కుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టాలకు కట్టుబడి ఉండే, చట్టపరమైన ప్రక్రియలను గౌరవించే వ్యక్తులు మాత్రమే హక్కులను పొందగలరని, అటువంటి వారి హక్కులకే రక్షణ ఉంటుందని పేర్కొన్నది. వాక్స్వాతంత్య్ర హక్కు పేరుతో ఎటువంటి శిక్షలు లేకుండా సోషల్ మీడియలో అభ్యంతరకరమైన పోస్టులు వ్యాప్తి చెందుతున్న తరుణంలో జస్టిస్ దినేశ్ మహేశ్వరి, అనిరుధ్ బోస్లతో కూడిన ధర్మాసనం తాజాగా ఓ కేసులో తీర్పునిచ్చింది.
సంబంధిత ఓ వ్యక్తి చట్టాలకు కట్టుబడకుండా ప్రాథమిక హక్కు కావాలంటే దాన్ని న్యాయబద్ధం చేయలేమని అభిప్రాయపడింది. మహారాష్ట్రలోని యాంటీ గ్యాంగ్స్టర్ చట్టం ఎంసీఓసీఏను సవాల్ చేస్తూ ఓ నిందితుడు చేసిన సవాల్పై న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.