ఖైరతాబాద్, అక్టోబర్ 4: సీఎం కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తున్నట్టు తెలంగాణ మత్స్యకార సమన్వ య కమిటీ సభ్యుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ చెప్పారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ ప్రభుత్వమూ మత్స్యకారుల సం క్షేమానికి పాటుపడలేదని, కేసీఆర్ వెయ్యి కో ట్ల బడ్జెట్తో, 90 శాతం సబ్సిడీతో పథకాలు వర్తింపచేస్తూ, ఉచిత చేపపిల్లలు, రొయ్యలు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు బల్ల సత్తయ్య ముదిరాజ్, బీ శ్రీనివాస్, అల్లుడు జగన్, సతీశ్, రంజిత్, కనకయ్య పాల్గొన్నారు.