కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ కోసం సీపీఐ చేస్తున్న ప్రతిపాదనకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రత్యామ్నాయం అంటే ఒక సంక్షేమ పథకమో, ఒక రాజకీయ నినాదమో కాదని, మతోన్మాదం, నయా ఉదారవాద విధానాలకు స్పష్టమైన ప్రత్యామ్నాయం ఇవ్వాలని పేరొన్నారు. అలా ప్రత్యామ్నాయం చూపే శక్తి కమ్యూనిస్టులకే ఉన్నదని తెలిపారు.
రాజకీయ తీర్మానాలు భవిష్యత్తులో ఒకటయ్యేందుకు దోహదపడాలని ఆకాంక్షించారు. ఉద్రేకం, విద్వేషాలు, మతోన్మాదం రెచ్చగొడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతోకాలం ముం దుకు సాగలేదని అన్నారు. రాష్ట్రంలో భూతంలాంటి బీజేపీ ప్రమాదం పొంచి ఉన్నందున మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. మునుగోడులో బీజేపీని ఓడిస్తామని చెప్పారు.