హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : వీటిల్లో నాణ్యమైన విద్య, రిసెర్చ్ వంటి అత్యుత్తమ ప్రమాణాలను అందించడమే అందుకు కారణం. సెంట్రల్ వర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) యూజీకి ఈ ఏడాది దరఖాస్తులు భారీగా పెరిగాయి. నిరుడు సీయూఈటీకి 9.9 లక్షల దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 13.99 లక్షల దరఖాస్తులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చితే ఈసారి సీయూఈటీకి హాజరయ్యే విద్యార్థుల సంఖ్య 41శాతం పెరిగింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడాల జగదీశ్కుమార్ మంగళవారం ఆయా వివరాలను మీడియాకు వెల్లడించారు. సీయూఈటీ (యూజీ) దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమై, మార్చి 12న ముగిసింది. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మార్చి 30 వరకు పొడిగించాము. మొత్తం మీద ఈ 13.99 లక్షల మంది దరఖాస్తులు నమోదైనట్టు జగదీశ్కుమార్ తెలిపారు.