అబ్దుల్లాపూర్మెట్ : ప్రభుత్వం గడ్డిఅన్నారం వ్యవసాయ, పండ్ల మర్కెట్ను తాత్కాలికంగా బాటసింగారం లాజిస్టిక్ పార్కులోకి తరలిస్తున్న స్థలాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గడ్డిఅన్నారం మార్కెట్ స్థలంలో సూపర్ స్సెషాలిటి ఆసుపత్రి నిర్మిస్తున్నందున లాజిస్టిక్ పార్కుకు తరలిస్తున్నట్లు తెలిపారు. కొహెడలో ఏర్పాటు చేసిన మార్కెట్యార్డు నిర్మాణ పనులు పూర్తి అయ్యే వరకు ఇక్కడే కొనసాగుతుందన్నారు. వాహనాల రాకపోకలకు పండ్ల కొనుగోలు కేంద్రాలకు అనుకూలంగా ఉంటుందన్నారు.
నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండ ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే పండ్ల వాహనాలు అవుటర్ పై నుంచి సులువుగా వచ్చి తిరిగి అవుటర్ పై వెలుతాయన్నారు. వచ్చే పది రోజుల్లో అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొవిడ్ కారణంగా ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ నగరం నలుమూలల 4మల్టీ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులు నిర్మించేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఒక ఆసుపత్రి రావడం సంతోషకరమన్నారు.
కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ కార్యాదర్శి పద్మహర్ష, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మరెడ్డి, సర్పంచ్లు లతశ్రీగౌరీశంకర్, కోట రాధలక్ష్మారెడ్డి, చెరుకు కిరణ్కుమార్, సురకంటి వనజశ్రీనివాస్రెడ్డి, డైరక్టర్ కొత్త కిషన్గౌడ్ నాయకులు పూజారి చక్రవర్తిగౌడ్, నోముల జగధీష్, ఉమాకాంత్చారి ఉన్నారు.