కొండాపూర్, మే 27: హైదరాబాద్ మాదాపూర్లోని మెడికవర్ దవాఖానలో శనివారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు దవాఖాన సెంటర్ హెడ్ అనిల్ తెలిపారు. ఇందులో కంప్లీట్ బ్లడ్ షుగర్, హిమోగ్లోబిన్, ఈఎస్ఆర్, రాండమ్ బ్లడ్ షుగర్, థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్, ఈసీజీ, యూఎస్జీ, అబ్డామిన్, పెల్విస్, పాప్స్మియర్, గైనకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, న్యూట్రిషన్ కన్సల్టేషన్ సేవలు అందించనున్నట్టు వెల్లడించారు. మొత్తం రూ.మూడు వేల విలువ చేసే పరీక్షలను పూర్తి ఉచితంగా నిర్వహిస్తామని చెప్పారు.
అపాయింట్మెంట్ కోసం 040-68334455 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఇంటర్ నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్స్ హెల్త్ సందర్భంగా ఈ సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను శుక్రవారం మెడికవర్ వైద్యులతో కలిసి నటి అంజలి ఆవిష్కరించారు. నిత్యం బిజీగా ఉండే మహిళలు తగిన సమయంలో పరీక్షలు చేయించుకొని అప్రమత్తంగా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చని మెడికవర్ ఉమెన్, చైల్డ్ హస్పిటల్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక అన్నారు.