హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు 30 రోజులు ఐఐటీ, నీట్పై ఉచిత ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని మెటామైండ్ అకాడమీ చైర్మన్ ఏ మనోజ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ ఐఐటీ విద్యార్థులు, మెడికోలచే ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వివరాలకు హైదరాబాద్లోని రామ కృష్ణమఠం పక్కనే ఉన్న అకాడమీలో సంప్రదించాలని సూచించారు.