ఉచితంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు
అవసరమైతే లైవ్ ట్రాన్స్ప్లాంట్స్
కరోనా తర్వాత తొలిసారి 3 సర్జరీలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ వైద్యానికి దీటుగా పేదలకు గాంధీ దవాఖాన వరంగా మారింది. కరోనా కష్టకాలంలో వేల మంది రోగులకు అండగా నిలిచిన ఈ దవాఖాన.. కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడేవారికి నాణ్యమైన వైద్యం అందిస్తున్నది. అవసరమైతే కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తున్నది. ఓ అడుగు ముందుకేసి లైవ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తున్నది. కరోనా తర్వాత ముగ్గురికి విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించింది.
గత మార్చిలో వరంగల్ జిల్లాకు చెందిన హరీశ్(35)కు అతడి తల్లి నుంచి కిడ్నీ సేకరించి, లైవ్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. అదే నెలలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన రమేశ్కు బ్రెయిన్డెడ్కు గురైన ఒక వ్యక్తి నుంచి సేకరించిన కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఈ నెల మొదటివారంలో కర్ణాటకకు చెందిన సద్దాం హుస్సేన్కు అతడి తండ్రి ద్వారా సేకరించిన కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేశారు. సద్దాం కర్ణాటకకు చెందిన రోగి అయినా, తెలంగాణ సర్కారు సహకారంతో పైసా ఖర్చు లేకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. రోగి పూర్తిగా కోలుకొని బుధవారం డిశ్చార్జి అయ్యారు. ఈ సర్జరీకి బయట రూ.10 లక్షల వరకు అవుతుందని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు పేర్కొన్నారు.
కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ జరిగిన తీరిది..
2014 నుంచి ఇప్పటిదాకా..
గత మూడు నెలల్లోనే..
ట్రాన్స్ప్లాంట్స్తో పాటు మందులూ ఉచితం
ఆర్థిక స్థోమత లేని పేదలకు గాంధీలో ఉచితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం. కరోనా తర్వాత మూడు నెలల కిందట మళ్లీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు ప్రారంభించాం. లైవ్ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నాం. ట్రాన్స్ప్లాంట్స్ తరువాత రోగికి జీవిత కాలం మందులను కూడా ఉచితంగానే ఇస్తున్నాం. ఈ మందులకు బయట ఏటా రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది.
– డాక్టర్ మంజూష, నెఫ్రాలజీ విభాగాధిపతి, గాంధీ దవాఖాన