నాగర్కర్నూల్: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ చట్టం అమలైతే వ్యవసాయానికి ఉచిత కరెంటు ఉండదని ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. అలాగే రైతుబీమా, రైతుబంధు కూడా అమలుచేసే అవకాశం ఉండదని చెప్పారు. నాగర్కర్నూల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు చట్టాలు అమలైతే దేశంలో రైతనేవాడే ఉండడని, వెంటనే ఉపసంహరణ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ధర్నాను విచ్ఛిన్నం కుట్రదారులు ప్రయత్నించారని ఆరోపించారు. లఖీంపూర్ ఖేరీ ఘటన బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం, బ్యాంకు, ఎల్ఐసీ వంటి రంగాలను కార్పొరేట్కు కట్టబెట్టడం సరికాదని విమర్శించారు.
రైతు అమరులకు సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో రూ.3 లక్షలు ప్రకటించారని, కేంద్ర ప్రభుత్వం కూడా రూ.25 లక్షాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలన్నారు. ఈ డిమాండ్లతోనే తాను రైతన్న సినిమాను రూపొందించానని, ప్రతిఒక్కరు ఆ సినిమాను తప్పకుండా చూడాలని కోరారు.