హైదరాబాద్ : పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు(lost). ఈ విషాదకర సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా కౌటాల మండలం తాటిపల్లి వద్ద సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హోలీ(Holi festival) ఆడిన అనంతరం నలుగురు యువకులు వార్ధా నదిలో(Wardha river) స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. నలుగురు కూడా మండల కేంద్రంలోని నదిమాబాద్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.