Thunderstorm | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పలు చోట్ల ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల మూగజీవాలు కూడా నేలకొరిగాయి.
నల్గొండ జిల్లా అప్పాజీపేటలో మహిళా రైతు భిక్షమమ్మ (46), మహబూబాబాద్ జిల్లా ఓతాయిలో గొర్రెల కాపరి చేరాలు (55), గుడెంగలో ప్రవీణ్ కుమార్ (27) అనే వ్యక్తి, వనపర్తి జిల్లా మియాపూర్లో కొరవ నాగరాజు (18) అనే యువకుడు పిడుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. మరో 4 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.