అయిజ, మే 31 : ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా మంత్రాలయంలో సత్యనారాయణస్వామి వ్రతానికి వచ్చి సమీపంలోని తుంగభద్రా నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతయిన ఘటన శనివారం చోటుచేసుకొన్నది. ఐదేళ్ల బాలుడిని రక్షించబోయి నదీ ప్రవాహంలో మరో నలుగురు కొట్టుకుపోగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. శనివారం ధనుశ్ మృతదేహం లభ్యంకాగా, ఆదివారం ఏపీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టి సతీశ్ (35), యవన్చంద్ర (5), సంధ్య (22), రాఘవేంద్ర (25) భౌతికకాయాలను వెలికితీశారు. తహసీల్దార్ రమాదేవి, సీఐ దస్తగిరి పర్యవేక్షించారు. మృతదేహాలను ఎమ్మిగనూర్ దవాఖానకు తరలించి పోస్ట్మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు భౌతికకాయాలను అప్పగించారు. సతీశ్, యవన్చంద్ర తండ్రీకొడుకులుకాగా.. కుమారుడిని రక్షించేందుకు వెళ్లిన తండ్రితోపాటు మరో ముగ్గురు నీటి ప్రవాహంలో మునిగి ప్రాణాలు కోల్పోవడం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.