Bhadrachalam | నలుగురు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఎస్పీ వినీత్ తెలిపారు. ఎస్పీ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. కొరియర్ల రూ.20లక్షలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, వాటిని మావోయిస్టులకు ఇచ్చేందుకు వెళ్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. దుమ్ముగూడెం మండలం పైడిగూడెం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని, అనుమానాస్పదంగా కారు కనిపించగా పట్టుకున్నట్లు తెలిపారు.