హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఎన్హెచ్-63పై అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రూ.928.41 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు నిర్మిస్తామని కేంద్ర రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ప్రకటన పట్ల ఎంపీ రంజిత్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు కేంద్ర మంత్రులతో తరచూ చర్చలు జరిపామని, తమ ఒత్తిడి ఫలించిందని తెలిపారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.