కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 23 : కొంపల్లి మున్సిపాలిటి పరిధి లో ఉమామహేశ్వర కాలనీలో రూ. 7కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న మురుగునీటి కాలువ నిర్మాణ పనులను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సందర్శించి పరిశీలించారు. ఉమామహేశ్వర కాలనీలో ప్రతి ఏటా కురిసె వర్షాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దీని కారణంగా ప్రత్యేకంగా మురుగుకాలువ నిర్మాణం చేపడితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలుసుకొని పురపాలక శాఖామం త్రి కేటీఆర్ సహకారంతో నిధులు మంజూరి చేయించి పనులను చేపట్టిన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి ఆలస్యం జరుగకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈయన వెంట కొంపల్లి మున్సిపల్ కమిషనర్ రఘు, చైర్మన్ శ్రీశైలం, డీఈ ఈ నరేందర్, ఇరిగేషన్ ఏఈ రామారావు పాల్గొన్నారు.