ములుగుటౌన్: ములుగు జిల్లా కేంద్రం శివారులోని గట్టమ్మ ఆలయం వద్ద శనివారం ఉదయం బస్సు.. కారును ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో ములుగు జిల్లా వాజేడు మండల ధర్మారానికి చెందిన కంభంపాటి శ్రీను (45), రమేశ్(48), అతడి భార్య జ్యోతి (42), కారు డ్రైవర్ బుద్ధ కల్యాణ్(26) ఘటనాస్థలంలోనే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన శ్రీను భార్య సుజాతను వరంగల్ ఎంజీఎంకు తరలించారు.