Telangana | ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. కామేపల్లి మండలం పండితాపురంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో నలుగురు బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. మండల అధ్యక్షుడి కారును కూడా కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేశారు. గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలను ఆస్పత్రికి తరలించారు.
దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. ఊరంతా పోలీసులు పహారా కాస్తున్నారు.