హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఐదు వేల ఓట్ల లోపు మెజార్టీతో నాలుగు సీట్లను బీఆర్ఎస్ కోల్పోయింది. పార్టీ 39 స్థానాల్లో గెలువగా నాలుగు స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.
దేవరకద్ర లాంటి స్థానంలో చివరి వరకు ముందంజలో ఉన్నా.. చివరి రౌండ్ ఓట్ల లెక్కింపులో పరాజయం పాలయ్యారు. జుక్కల్, దేవరకద్ర, బోధన్, ఖానాపూర్ నియోజకవరాలు స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాల్లో ఉన్నాయి.