ఖైరతాబాద్, నవంబర్ 5: తాము సెటిలర్స్ కాదని, పక్కా c. ఆదివారం ఆయన పంజాగుట్టలోని అసోసియేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర పేరుతో కొందరు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుంటే, మరికొందరు మరిచిపోయిన అంశాలను మళ్లీ వెలుగులోకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో తమకు ప్రత్యేకించి ఎలాంటి డిమాండ్లు లేవని, పొలిటికల్ స్పేస్ కూడా అవసరం లేదని, పొత్తులతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. సీమాంధ్ర రాజకీయ పంచాయితీల్లోకి తమను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ నుంచి దశాబ్దాల క్రితమే వచ్చి ఇక్కడే స్థిరపడ్డామని, తెలంగాణలో మమేకమయ్యామని పేర్కొన్నారు. పదేండ్లుగా కొట్లాటలు, విద్వేషాలకు తావు లేకుండా ఎంతో ప్రశాంతంగా, కలిసి మెలిసి జీవిస్తున్నామని చెప్పారు. ఇక్కడి ప్రజలతో సమానంగా ప్రభుత్వం తమకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నదని తెలిపారు. గ్రేటర్ రాయలసీమ కల్చరల్ అండ్ వెల్ఫేర్ భవనానికి స్థలం కేటాయించాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాఘవ్, బద్రీనాథ్, నిరంజన్ దేశాయ్, చంద్రశేఖర్రెడ్డి, కులేశ్వర్రెడ్డి, రాజేశ్, రాజశేఖర్రెడ్డి, రామకృష్ణారెడ్డి, వేణుగోపాలస్వామి, సుబ్బారెడ్డి, వెంకటస్వామి, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.