హుజూరాబాద్ : జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో యాదవ కమ్యూనిటీ భవనానికి వర్ధన్నపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ శంకుస్థాపన చేశారు. ఈ భవనాన్ని రూ. 10 లక్షలతో నిర్మించనున్నారు. కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే రమేశ్కు కోరపల్లి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.