దేవరకొండ: వ్యవసాయంలో రైతులను రాజులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మాల్ మార్కెట్ చైర్మన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి పాల్గొని మాట్లాడుతూ 70 సంవత్సరాల సమైక్య పాలనలో రైతుల బాగోగులు చూసే పాలకులు లేరని మంత్రి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనే రైతులు అర్థికంగా బలపడుతున్నారని మంత్రి చెప్పారు. రైతులకు ప్రేవేటు వ్యాపా రులను అశ్రయించకుండా పంటకాలానికి ముందస్తుగా రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5వేల చొప్పున రెండు పంటలకు అందజేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేసుకొని వ్యవసాయానికి సాగు నీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి అన్నారు.
రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ పథకంతో రైతులు ఎంతో సంషంగా ఉన్నారని మంత్రి అన్నారు. రైతుల పండించి పంటను ప్రభుత్వమే కొనుగొలు రైతుల ఖాతాల్లో డబ్బులు వేసిన చరిత్ర ముఖ్యమంత్రిదే అని అన్నారు. రైతులు పంటలు వేయాలని చర్చించేందుకు రైతు వేదికల ద్వారా ముందుగానే ఏ పంటలను వేసేందుకు రైతు వేదికలు ఉపయోగ పడుతాయని మంత్రి చెప్పారు.
రైతుల సంక్షేమం కోసం రైతు బంద్ అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు ప్రమాదం జరిగినప్పుడు రైతుల కుటుంబాలకు ఆర్ధికంగా తోడ్పాటు ఉండేందుకు రైతు బీమా ఉపయోగపడుతుందన్నారు. అనంతరం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారత్సోవం చేశారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎంఎల్సీ తేరా చిన్నపురెడ్డి, డీఎంఅండ్హెచ్వో కొండల్రావు, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో కృష్ణకుమారి, మునుగొడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నాంపల్లి ఎంపీపీ శ్వేత, చింతపల్లి జడ్పీటీసీ కంకణాల ప్రవీణ, సర్పంచ్ కుంభం శ్రీనివాస్గౌడ్, మండల రైతుబంధు అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటయ్య డాక్టర్ భరత్, ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరలు పాల్గొన్నారు.
ప్రాధమిక ఆసుపత్రిలో పెద ప్రజలకు 95 రకాల సేవలు : మంత్రి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కార్పొరే ట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ల్యాబరేటరీ ఏర్పాటుతో 95 రకాల పరీక్షలు పీహెచ్సీలోనే అందుబాటులో ఉంటాయన్నారు. హైద్రాబాద్కు వెళితే అధికంగా అయ్యే ఖర్చుల భారం తగ్గుతుందన్నారు.
కొండమల్లేపల్లి ఎంపీపీ రేఖారెడ్డి, పీహెచ్సీని దత్తత తీసుకుని మరింత సేవలు అందించేందుకు ఆమె ఆధ్వర్యంలో రూ.15లక్షల వ్యయం తో ఏర్పాటు చేయడంపై మంత్రి అభినందించారు. కరోనా టెస్టులతో పాటు పలు పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి 15 రోజులకోసారి గైనకాలిజిస్టు అందుబాటులో ఉంటారని మంత్రి తెలిపారు. సుమారు 35వేల జనాభా ఉన్న ప్రాథమిక దవాఖాన స్థాయిని పెంచాలని మంత్రికి వివరించారు. పేదలకు మైరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారు పేదవారు ఉంటారని వారికి మేరుగైన సేవలు అందించేందుకు అన్ని వసతులు అందుబాటులో ఉంచాలని మంత్రి చెప్పారు. పీహెచ్సీ కేంద్రానికి వసతులు కల్పించేందుకు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ నిధుల నుంచి రూ.5లక్షలు ఆయన ప్రకటించారు.
రైతులు గర్వంగా చెప్పుకునేది కేసీఆర్ ప్రభుత్వంలోనే : మంత్రి
మాల్: తెలంగాణ రాష్ట్రంలో రైతులు నేను వ్యవసాయం చేస్తున్నామని గర్వంగా చెప్పుకునేది కేసీఆర్ ప్రభుత్వంలోనే ఆని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం చింతపల్లి మండల పరిధిలోని మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం నూతనంగా నియమించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జగదీశ్వర్, వైస్ చైర్మన్ కిష్టారెడ్డితోపాటు పాలకవర్గ సభ్యులు మాల్లోని సాగర్రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించి మంత్రిని ఘనంగా సన్మా నించారు.