హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్సింగ్ అహ్లువాలియాతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం భేటీ అయ్యారు.
సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆయనతో చర్చించారు. గడిచిన పదేండ్లలో భారీగా పెరిగిన అప్పులు, వాటి ప్రభావంపై వారు చర్చించారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో అనుసరించిన ఆర్థిక సంస్కరణలు, వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.