సుల్తానాబాద్, ఫిబ్రవరి 5 : పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు (74) సోమవారం తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పదిరోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు. ఆ తర్వాత వైద్యుల సూచనతో హైదరాబాద్లోని నివాసానికి తరలించారు.
సోమవారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా మరోసారి గుండెపోటు రావటంతో మృతిచెందారు. ఎమ్మెల్యే విజయరమణారావు నివాళులర్పించారు. దుబాయ్లో ఉన్న ఆయన కొడుకు వచ్చాక మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.