కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 6: బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం ఉందంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేయడం అర్థరహితమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బాధ్యతాయుత పదవిలో ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఒక్కటేనని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్లో కాకుండా.. పక్కన ఉన్న గుమ్లాపూర్లో రేవంత్ సభ పెట్టారని చర్చ నడుస్తున్నదని చెప్పారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే నివాసంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ రిపోర్టుపై ఇప్పటికే హరీశ్రావు, జోషి హైకోర్టును ఆశ్రయించగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దంటూ కోర్టు స్టే ఇచ్చిందని గుర్తుచేశారు. గంగుల మాట్లాడుతూ..
బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని తానే చేసినట్టు బండి సంజయ్ చెప్పుకొంటున్నారని విమర్శించారు. బండి సంజయ్ ప్రచురించిన కరపత్రాల్లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. స్మార్ట్సిటీ సాధన, నిధుల మంజూరులో ఆయన పాత్ర ఏమీ లేదని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు పాల్గొన్నారు.