హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ కాంగ్రెస్లో చేరారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసంలో రవీందర్తో పాటు పీఆర్టీయూ టీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పూల రవీందర్ మాట్లాడుతూ విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం నూతన ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెలా మొదటి తేదీనే వేతనాలు అందిస్తున్నందుకు ముఖ్య మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులు, ఏకీకృత సర్వీసు రూల్స్ను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.