హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్సీ డీ రాజేశ్వర్రావు నియమితులయ్యారు. తొలి చైర్మన్ రాజేశ్వర్రావే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేండ్లపాటు రాజేశ్వర్రావు చైర్మన్ పదవిలో కొనసాగనున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజేశ్వర్రావు మూడు సార్లు ఎమ్మెల్సీగా సేవలు అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన రాజేశ్వర్రావు పదవీకాలం ఇటీవలే ముగిసింది. క్రిస్టియన్ మైనార్టీ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 2014లో తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్రావుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. రాజేశ్వర్రావును గురువారం సీఎం కేసీఆర్ చైర్మన్గా నియమించిన అనంతరం ఆయన హైదరాబాద్లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా అభినందించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ తదితరులు