నాంపల్లి కోర్టులు/ఖైరతాబాద్ ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద డిసెంబర్ 24 అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి తిరిగి వస్తున్న ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసి, సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. విచారణ నిమిత్తం రాహిల్ను 7 రోజులపాటు తమకు అప్పగించాలని పంజాగుట్ట పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు నిందితుడిని గుర్తించేందుకు ఐడెంటిఫికేషన్ పరేడ్కు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. 2022లో కూడా రాహిల్ కారు ఢీకొనడంతో జూబ్లీహిల్స్పీఎస్ పరిధిలో ఇద్దరు మరణించారని, ఆ సమయంలో ఆ కారు డ్రైవర్ పక్కన రాహిల్ కూర్చున్నట్టు పోలీసులు గుర్తించారని పీపీ వివరించారు. దీనిపై నిందితుడి తరఫు న్యాయవాది స్పందిస్తూ.. విచారణకు సహకరించేందుకే రాహిల్ భారత్కు వచ్చాడని తెలిపారు.
హైకో ర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 22లోగా కోర్టులో హాజరుకావాల్సిన రాహిల్ను అధికారులు విమానాశ్రయంలోనే అరెస్టు చేయడం కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనేనని వాదించారు. దీంతో రాహిల్ను 14 రోజులపాటు (ఈ నెల 22 వరకు) జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని మెజిస్ట్రేట్ కన్నయ్యలాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం రాహిల్కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో.. నిందితుడికి బెయిల్ మంజూరు చేయవద్దని పీపీ కోరారు. రాహిల్ బెయిల్ పిటిషన్పై తీర్పును బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.