మానకొండూర్ రూరల్, జనవరి 5 : హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ ప్రజలను, రైతులను దగా చేస్తున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో పల్లెమీద చౌరస్తాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో రైతు భరోసాకు రూ.12 వేలు ఇవ్వడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ.. రేవంత్ ఇచ్చిన ఇచ్చిన ప్రతి హామీని విస్మరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి నిరూపించుకున్నదని విమర్శించారు. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ.12 వేలు మాత్ర మే ఇస్తామంటూ మాట మార్చడం సరికాదని అన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన పోరా టం చేస్తామని హెచ్చరించారు.