మెదక్ : ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, ప్రజా తీర్పును శిరసా వహిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి(Padmadevender Reddy) అన్నారు. సోమవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. 25 ఏళ్లుగా ఉద్యమంలో రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, అధైర్య పడకుండా ముందుకు సాగినట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజలు ఆడబిడ్డగా ఆదరించి సహకరించారని అన్నారు.
ప్రజలకు ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా నిలుస్తూ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానన్నారు. ఓటమిని గెలుపుగా భావిస్తూ ముందుకు వెలుదామని కార్యకర్తలు, నాయకులు సూచించారు. బీఆర్ఎస్ శ్రేణులు అధైర్య పడకుండా ప్రజలకు అండగా నిలవాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో శ్రమించిన కార్యకర్తలు, నాయకులకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.