హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): మిస్ వరల్డ్-2025 పోటీల పేరిట హైదరాబాద్లో జరిగేది బ్యూటీ కాంటెస్ట్ కాదని, కాంగ్రెస్ లూటీ కాన్సెప్ట్ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. ధాన్యం కొనే దికులేక రోడ్లపాలైన రైతులను సర్కార్ పట్టించుకోకపోవడం దారుణమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరికీ అకరకు రాని అందాల పోటీలు నిర్వహించడానికి రూ.200 కోట్లు ఖర్చు పెట్టాలనుకోవడం ప్రభుత్వ తిరోగమన విధానాలకు పరాకాష్ట అని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలంకార ప్రాయమని, రైతులకు అధికారుల దర్శనభాగ్యమే కరువైందని మండిపడ్డారు. తూకం వేయడానికి కాంటాలు, కొన్న ధాన్యం తరలించడానికి లారీలు లేని దుస్థితి తలెత్తినా పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయమని మండిపడ్డారు.
గన్నీ బ్యాగ్లకే గతిలేదు, రేవంత్ సరార్కు మతిలేదు అని విమర్శించారు. అతివల సౌందర్యం పెట్టుబడిగా, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను పెంచి అభివృద్ధి చేస్తామనడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ‘రైతు వ్యతిరేక కాంగ్రెస్ హింసారాజ్యం వద్దే వద్దు.. పదేండ్ల పాలనలో వ్యవసాయానికి స్వర్ణయుగం తెచ్చి, రైతును రాజును చేసిన కేసీఆర్ రాజ్యమే ముద్దు’ అని తెలంగాణ రైతులు కోరుకుంటున్నారని జీవన్రెడ్డి స్పష్టం చేశారు. ఖాళీ ఖజానా అంటూ బీద ఏడ్పులు ఏడ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీల కోసం అందగత్తెలకు రెడ్ కార్పెట్ పరుస్తూ అన్నదాతల చేతికి సున్నం పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయం గందరగోళంగా మారిందని జీవన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.