వట్పల్లి, ఏప్రిల్ 14 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేసి న దళితబంధు పథకం ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. లబ్ధిదారుల కుటుంబాలు వెలుగులు నింపాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం బుడ్డాయిపల్లి గ్రామం. ఈ గ్రామానికి చెందిన దళితులు దళితబంధు పథకం ద్వారా వ్యాపారంతోపాటు, రవాణా రంగంలో రాణిస్తున్నారు. వాటి ఫలాలు ఇప్పుడిప్పుడే కన్పిస్తున్నాయి. లబ్ధిదారులు సొంత నిధులతో గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మంగళవారం అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం వారి ఆర్థిక ప్రగతికి అద్దం పడుతున్నది. ఈ సందర్భంగా దళిత బంధు ద్వారా తీసుకున్న వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ద్వారా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం తమ జీవితాల్లో వెలుగులు నింపిందని కొనియాడా రు. అనంతరం మాజీ ఎమ్మెల్యే క్రాంతి మా ట్లాడుతూ.. అంబేద్కర్ కలలుగన్న ఆర్థిక స మానత్వ సాధనలో దళితబంధు పథకం విప్లవాత్మక అడుగు అని పేర్కొన్నారు. గ్రామ దళితులు తమ ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ హితం కోసం వినియోగిచండం అభినందనీయమని కొనియాడారు. అంబేద్కర్ ఆర్థిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ.. దళితబంధు పథకం ద్వారా లభ్ధిదారులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు. ఎటువంటి పూచీకత్తు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన రూ.10 లక్షల ఆర్థిక సాయం వల్ల దళితులు వ్యాపారవేత్తలుగా మారి, రవాణా రంగంలో స్థిరపడి గౌరవప్రదమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారని చంటి క్రాంతి కిరణ్ వెల్లడించారు.