కామారెడ్డి : కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ( Bigala Ganesh Gupta ) కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా గణేష్ గుప్తా కారును వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది.

కారును 50 మీటర్ల మేర ఈడ్చుకుపోయి డివైడర్పై నిలిచిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయట పడ్డారు. భిక్కనూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Bigala Ganesh Gupta 1