భద్రాద్రి కొత్తగూడెం : పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో కన్నుమూశారు. 1983వ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి భూపతిరావు సీపీఐ తరపున గెలుపొంది 2 సంవత్సరాలపాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. భూపతిరావు కుమారుడు భీమపాక నగేశ్ ఇటీవల హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు.
పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతి పట్ల ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్రెడ్డి, ఖమ్మం ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, నాయకులు కర్నాటి భానుప్రసాద్, మహ్మద్ మౌలానా తదితరులు సంతాపం తెలిపారు.