హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి (45) కుటుంబాన్ని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు. తన అనుచరుడు బొడ్డు శ్రీధర్ రెడ్డి(Sridhar Reddy) భౌతికకాయాన్ని చూసి హర్షవర్ధన్ రెడ్డి( Beeram Harshavardhan Reddy) కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్ష్యతోనే శ్రీధర్రెడ్డిని హత్య చేశారని ఆయన ఆరోపించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు.
ఇటీవల బీఆర్ఎస్ మద్దతుదారులపై వరుసగా దాడులు జరుగుతున్నాయని హర్షవర్దన్రెడ్డి చెప్పారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కాగా కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో గత అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట ఆరుబయట నిద్రిస్తున్న ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో తల నరికి చంపేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.
తన అనుచరుడు బొడ్డు శ్రీధర్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి కంటతడి పెట్టిన బీరం హర్షవర్ధన్ రెడ్డి. pic.twitter.com/SmFr5YYoWh
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2024