యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రాన్ని అమ్ముతారని, బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్(MLA Bhikshamayya Goud )అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలేరులో జరిగిన సీఎం ఆశీర్వాద బహిరంగ సభను విజయవంతం చేసినందుకు బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలతో ఓటర్లను మభ్యపెడుతున్నారని, మోసపావొద్దని సూచించారు.
కర్ణాటకలో రైతులకు రోజుకు 5గంటల విద్యుత్ను మాత్రమే ఇస్తున్నామని స్వయంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పడంతోనే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకునే రేవంత్ రెడ్డి.. రేపు అధికారం వస్తే రాష్ట్రాన్ని కూడా అమ్ముతాడని విమర్శించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ బ్రోకర్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ల కోసం బీజేపీకి అమ్ముడుపోయాడని దుమ్ముత్తిపోసిన రేవం తిరెడ్డి తిరిగి మునుగోడు కాంగ్రెస్ టికెట్ను ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. నిన్న దుబ్బాకలో జరిగిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై ఆత్మ హత్యానం, తీవ్రంగా ఖండి మరొకసారి కారు గుర్తుకు ఓచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.