నయీంనగర్, జనవరి 18: తాను బీఆర్ఎస్ను వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని మాజీ ఎమ్మె ల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ తెలిపారు. గురువారం ఆయన హనుమకొండ ప్రశాంత్నగర్లోని తన నివాసంలో మీడియాతో మా ట్లాడారు.
2012లో పీఆర్పీ విలీనం తర్వాత ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్లో చేరానని, అప్పటి నుంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు.